మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం...! ఒకటో తరగతి నుంచే బేసిక్ మిలిటరీ శిక్షణ!
Tue Jun 03, 2025 12:40 Education
మహారాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఇకపై ఒకటో తరగతి నుంచే విద్యార్థులకు ప్రాథమిక సైనిక శిక్షణ (బేసిక్ మిలిటరీ ట్రైనింగ్) ఇవ్వాలని సంకల్పించింది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో చిన్నతనం నుంచే దేశభక్తి, క్రమశిక్షణ, శారీరక దృఢత్వం వంటి మంచి లక్షణాలను పెంపొందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దాదా భూసే వెల్లడించారు.
ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు ఈ శిక్షణ ఇవ్వడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలనే దానిపై వారికి అవగాహన కలుగుతుందని మంత్రి దాదా భూసే తెలిపారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో మాజీ సైనికులతో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ శిక్షణ ద్వారా విద్యార్థుల్లో దేశం పట్ల ప్రేమ, గౌరవం మరింత పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం! ఎన్డీఏ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..!
ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా సానుకూలంగా స్పందించారని విద్యాశాఖ మంత్రి దాదా భూసే వివరించారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి క్రీడా ఉపాధ్యాయులు, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ), స్కౌట్స్ అండ్ గైడ్స్తో పాటు సుమారు 2.5 లక్షల మంది రిటైర్డ్ సైనికుల సహాయ సహకారాలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.
ఏప్రిల్ 22న పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి, ఆ తర్వాత భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పరిణామాల నేపథ్యంలో ఈ సైనిక శిక్షణ ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు మంత్రి భూసే స్పష్టం చేశారు. కశ్మీర్లోని పహల్గామ్ బైసరన్ లోయలో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దారుణ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందని ఆరోపిస్తూ పాకిస్థాన్పై భారత ప్రభుత్వం దౌత్యపరమైన చర్యలు చేపట్టింది. ఇదే సమయంలో, భూకంపాలు, అగ్నిప్రమాదాలు, వరదలు, ఉగ్రదాడులు వంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రజలు, అధికారులు తమను తాము ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా 259 ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించారు.
ఇది కూడా చదవండి: మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్లో ఈ మార్పులు గమనించారా..? వారికి నో ఛాన్స్..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్ కొత్త టైమింగ్స్, తేదీలు ఇవే..!
ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!
ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం బంపరాఫర్..! ఆ ప్లాట్లు వేలంలో దక్కించుకునే మంచి ఛాన్స్!
రేషన్ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!
ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!
ఏపీలో వారందరికీ గుడ్న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!
పేదలకు శుభవార్త..! ఫించన్ల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
తల్లులు, విద్యార్థులకు భారీ శుభవార్త..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!
ఇంజినీరింగ్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్..! BEL నోటిఫికేషన్ రిలీజ్!
ఏపీలో 10 అద్భుతమైన బీచ్లు.. ఈ హిడన్ జెమ్స్ లాంటి బీచ్లను మిస్ అవ్వకండి..
ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్లోనే, డీపీఆర్ పనులు..!
వైసీపీకి దిమ్మ తిరిగే షాక్! టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో కీలక నిందితుడు అరెస్ట్!
రూ.500 కోట్ల కుంభకోణంలో కిరణ్ అరెస్ట్! దర్యాప్తులో వారి వివరాలు వెల్లడి!
కవిత కు కేసీఆర్ మార్క్ ట్రీట్మెంట్..! హరీష్ కు కీలక బాధ్యతలు..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravsi #MaharashtraDecision #MilitaryTrainingInSchools #BasicMilitaryTraining #EducationReform
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.